Wednesday, 22 February 2012

Home


వ్యవసాయం మానవ నాగరికతకు మూలం. మారుతున్న పిరిస్థితులకు అనుగిణంగా వ్యవసాయం పద్ధతులను మార్చుకుంటున్నం. మన దేశానికి స్వాతంత్రయం రాక మునుపు పశువులను ఆధారం చేసుకొని వ్యవసాయం సాగిస్తూ వచ్చాం. శ్రుస్టిలో జీవరాశులన్ని సహ సంబంధంలో జీవించేవి. జనాభా పెరుగుతూ వచ్చింది. పండిస్తున్న పంటలు సరిపోని పరిస్థితి ఏర్పడిందని హైబ్రీడు విత్తనాలు, రసాయన ఎరువులు ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధించాలనుకున్నం... సాదించాం. కాని..... దిగుబడి పెరుగుతున్నదని ఆనందించామే గానీ... ప్రక్రుతి ఈమవుతున్నదని ఆలోచించలేకపోయాం. పొంటలకు చేడపీడలు ఆశించాయి. కావలసిన మొతాదులో పశువుల పేడ అందించకుండా... పూర్తిగా రసాయన క్రిమిసమహారక మందులు వాడడం మొదలు పెట్టాం. దిగుబది పెరుగుతున్నట్టు మొదట్లో అనిపించినా క్రమంగా తగ్గుముఖం పట్టింది. పెట్టుబడి తడిసి మోపెడైంది. రాబడి తగ్గింది. మనం ఏదో తప్పు చేస్తున్నమనే ఆలోచన మొదలైనది. దీనికి కారణాలు అన్వేషించాం.  

పశువులు లేకుండా వ్యవసాయం చేయడం తప్పు అని తెలుసుకున్నం. పాడిని మరిచి పంటను పండించాలన్న ద్రుక్పధం లోపభూయిష్టమని గ్రహించాం. రసాయనిక ఎరువులు, క్రిమిసమ్హార మందులు వాడటం పూర్తిగా మానేసి... సేంద్రియ వ్యవసాయ పధతులు అనివార్యమని గ్రహించడంతో... సేంద్రియ వ్యవసాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, ఇందులో కూడా అనేక ఒడిదుడుకులు చవిచూస్తున్నం. పశువుల పేడ సరిపోయినంత లేక సతమతమవుతున్నం. సేంద్రియ వ్యవసాయ పద్దతి కూడా అధిక ఖర్చుతో కూడుకున్నదైనందున... సేంద్రియ వ్యవసాయం కూడా నస్టదాయకమైనదేనని నిర్ధారణకు వచ్చాం. 

అటువంటి పెను సంక్షోభం ఊఅబిలో భారతీయ రైతాంగం కూరుకుపోయిన నేపధ్యంలో శ్రీ సుభష్ పలేకర్ గారు సునిశిత పరిశోధనతో రూపొందించిన పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయం (Zero Budget Natural Farming) రైతాంగానికి వెలుగు బాట చూపింది. ప్రక్రుతి వ్యవసాయం చేయడానికి బండ్లకు బండ్లు పేడ అవసరం లేదు. ఒక్క దేశీయ ఆవు పేడ, మూత్రంతో 30 ఎకరాల్లో పంటలను ఆరొగ్యదాయకంగా పండించుకొవచ్చు. అటువంటి దివ్యమైన మర్గమే శ్రీ సుభష్ పలేకర్ గారు తెలియజేస్తున్న పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయం. విషపూరిత రసయనాలను విచక్షణారహితంగా ఉపయోఅగించి ఇన్నాళ్ళు పుడమి తల్లిని నిర్జీవం చేసిన మనం... పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయాన్ని నిండు మనసుతో అనుసరిద్దాం. దేశీయ ఆవు ద్వారా పుడమి తల్లికి జీవరాశులు అందించి ధాన్యరాశులు పండిద్దం. ప్రక్రుతిలో లభించే వనరులను మాత్రమే ఉపయోగించి పెట్టుబడి లేని వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాదిద్దం.      

గోశాల


జీవామ్రుతము

జీవామ్రుతం ఆవశ్యకత
* దేశీయ ఆవు శ్రేష్ఠ మైనది. దేశీయ ఆవు పేడ, మూత్రం ద్వారా "జీవామ్రుతం" తయారు చేసుకొని భూమాత ఆరోగ్యం కాపాడుతూ, ఆరోగ్యదాయకమైన పంటలు పండించవచ్చు. ప్రజారోగ్య పరిరక్ష్ణకు ఇదే మార్గం.
* దేశీయ ఆవు పెడ భూమి మీద పడితే...... భూమిలో రంధ్రాలు ఈర్పడి...... వానపాముల ద్వారా పంటలకు కావలసిన పోషకాలు అందుతాయి. దీశీయ ఆవు పాలు అమ్రుతం, మూత్రం దివ్యమైన ఔషధం. 1 గ్రాము మట్టిలొ 100 కోట్ల జీవరాశులు ఉంటాయి. దేశీయ ఆవు పేడ, మూత్రం వాడి ఆ జీవరాశిని పెంపొందిచుకోవడం ద్వారా పంటలకు పోషకాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు
* ఈ విధంగా 1 దేశీయ ఆవుతో 30 ఎకరాలు సాగుచెయవచ్చు. నీరు, విద్యుత్తు సగనికి సగం ఆదా అవుతాయి. ఎరువుల అవసరమే లేదు,. వాతావరణ కాలుష్యం వుండదు. సాగు ఖర్చ్చులు 80 శాతం తగ్గిపోతుంది. నాణ్యమైన, ఆరొగ్యకరమైన, అన్ని పోషకాలు కలిగిన పంట దిగుబదులు సాధించవచ్చు. వ్యవసాయ రంగంలొ చోటు చేసుసున్న సొక్షోభానికి, ముక్యంగా రైతుల ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయమే. 



జీవామ్రుతం
కావలసిన పదార్ధాలు:
1) ఆవు పేఅడ  -- 10 కేజీలు
2) ఆవు మూఅత్రం -- 5 నుండి 10 లీతర్లు
3) బెల్లం --- 2 కేజీలు
4) పప్పుల పిండి -- 2 కేజీలు
5) నీరు  --- 200 లీతర్లు
6) పుట్ట మట్టి లేక గట్టు మట్టి --- పిడికెడు
తయారు చేసే విధానం:
తొట్టిలో గాని, డ్రమ్ములో గానీ 200 లీతర్లు నీటిలో ఈ పదార్ధాలన్నిటినీ కలిపి... ప్రతి రోజూ రెండు మూడు సార్ర్లు కర్రతో కలియ తిప్పాలి. 48 గంటల తర్వాత వాడుకోవచ్చు. ఈ జీవామ్రుతం ఒక ఎకరానికి సరిపోతుంది. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పొలం మొత్తనికీ జీవామ్రుతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు లేద30 రోజులకు ఒక సారి జీవామ్రుతన్ని నీటితో పాటు అందించాలి. దీని ద్వారా భూమిలోని జీవరాశి పెంపొంది, ఆరోగ్యవంతమవుతుంది. ఆరొగ్యవంతమైన భూమి మొక్కలకు పోషకాలను అందిస్తుంది ఇల మంచి దిగుబడులు సాధించవచ్చు.    



 
జీవామ్రుతం పిచికారీ చేసే పద్ధతి

3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకూ: ఎకరానికి
మొదటసారి: (విత్తనం నాటిన 1 నెలకి) 5 లీటర్ల జీవామ్రుతం, 100 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
రెండోసారి: (మొదటసారి పిచికారీ చేసిన 21 రోజుల తరువాత) 10 లీటర్ల జీవామ్రుతం, 150 లీటర్ల నీతిని పిచికారి చేయాలి.
మూడోసారి: (రెందోసారి పిచికారీ చేసిన 21 రోజుల తరువాత) 20 లీటర్ల జీవామ్రుతం, 200 లీటర్ల నీరు పిచికారీ చెయాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుదు - మిల్కింగ్ స్తేజ్) 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీతిని కలిపి పిచికారీ చేయాలి. చివరిసారి జీవామ్రుతం అవసరం లేదు.

సక్సెస్ అయిన రైతులు

మా ప్రాంతములో పెట్టుబడి లేనీ ప్రక్రుతి వ్యవసాయం చేస్తున్న రైతులు:  
1). క్రిష్ట్ణా రెడ్డి : చెరకు, వరి
2). రామమొహన్ రెడ్డి : చెరకు, వరి,
చేరకు నుండి ఎలాంటి కెమికల్స్ లేకుండా బెల్లము తయారు చేస్తున్నారు.